రాయదుర్గం: మండల కన్వీనర్ కాలువసన్నన్న ఆధ్వర్యంలో గుమ్మగట్ట మండల విస్తృత స్థాయి సమావేశం
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలలని తెలుగుదేశం పార్టీ గుమ్మగట్ట మండల కన్వీనర్ కాలువసన్నన్న కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం మద్యాహ్నం రాయదుర్గం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో గుమ్మగట్ట మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ ఆదేశాల మేరకు త్వరగా నిర్వహించనున్న మహానాడు నిర్వాహణ ఏర్పాట్లు, చర్చించే అంశాలపై దిశానిర్ధేశం చేశారు.