కొండపి: మర్రిపూడి ఎస్సై రమేష్ తనను కొట్టాడంటూ ప్రసాద్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం ఆసుపత్రికి తరలింపు
ప్రకాశం జిల్లా మర్రిపూడి ఎస్సై రమేష్ తనను కొట్టాడంటూ కనిగిరి కి చెందిన ప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ నగదు లావాదేవీల విషయంలో తమను పిలిపించి కొట్టినట్లుగా ఆత్మహత్యకు యత్నించిన ప్రసాద్ కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రసాద్ పరిస్థితి ప్రస్తుతం ఆందోళన కారణంగా ఉందని తమకు న్యాయం చేయాలని ప్రసాద్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.