దర్శి: అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పాల్గొన్న దర్శి టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | Jun 21, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఎన్టీఆర్ పల్లెవనం పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేశారు. యోగా శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని ప్రతి ఒక్కరూ దానిని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.