మార్కాపురం: ఆగస్టు 15 నాటికి గృహ నిర్మాణ లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లాలో ఆగస్టు 15 నాటికి గృహ నిర్మాణ లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత ఆ శాఖ అధికారులు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో గురువారం గృహ నిర్మాణల ప్రగతి పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గృహ నిర్మాణ కోసం కేటాయించిన లేఔట్లలో నీటి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. గతంలో బేస్మెంట్ లెవెల్ లో వదిలేసిన గృహాలను గుర్తించి వాటిని రద్దు చేస్తామన్నారు. నూతన గృహాలు నిర్మించుకునే వారికి డీఆర్ డీ ఏ , మెప్మా ల ద్వారా లోన్స్ ఇప్పిస్తామన్నారు. జిల్లాకు కేటాయించిన మొత్తం 3381 ఇళ్లను ఇచ్చిన గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు.