రాయదుర్గం: భక్తిశ్రద్దలతో బక్రీద్ పండుగ జరుపుకోవాలి : రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ
బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో సమాజంలో సోదరభావాన్ని పెంపొందించే విధంగా జరుపుకోవాలని రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ కోరారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకొని శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా కణేకల్ పోలీస్ స్టేషన్లో రూరల్ సర్కిల్ సీఐ వెంకటరమణ, కణేకల్ ఎస్ఐ నాగమధు ఆధ్వర్యంలో సోమవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ముస్లిం సోదరులు, వివిధ వర్గాల పెద్దలు, గ్రామ ప్రముఖులు హాజరయ్యారు. పండుగ రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలందరూ పోలీసు వారికి పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.