కొండపి: సింగరాయకొండ 16 నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, టెంపో, ట్రాక్టర్ ఢీకొని ఐదు మందికి గాయాలు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపైకారు-ట్రాక్టర్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో టెంపో, ట్రాక్టర్ రెండూ బోల్తా పడ్డాయి. వైజాగ్ నుంచి తిరుమల వెళ్తున్న ఆ కారులో మొత్తం 8 మంది ప్రయాణిస్తుండగా వారిలో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కారులోని ఇద్దరు చిన్నపిల్లలు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.