ఉరవకొండ: ఆధ్యాత్మికత తోనే శాంతి, సహనం అలవడుతాయి: గూళ్ల పాలెం లో గవి మఠం ఉత్తరాధికారి కరి బసవ రాజేంద్ర స్వామి
ఆధ్యాత్మికత తోనే శాంతి, సహనం అలవడుతాయని ఉరవకొండ గవి మఠం ఉత్తరాధికారి డాక్టర్ కరి బసవ రాజేంద్ర స్వాముల వారు అన్నారు. వజ్రకరూరు మండలం గూళ్ల పాలెం లోని గురుదేవ ఆశ్రమంలో సోమవారం నూతన శిల మండప ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాజేంద్ర స్వాముల వారు హాజరయ్యారు. ధ్యానం ద్వారానే మోక్షం కలుగుతుందన్నారు. అనంతరం హోమాలు, గురు పూజ వంటి విశేష పూజలు చేశారు.