రాయదుర్గం: సహకార సంఘాల ఉద్యోగులకు నష్టం కలిగించే జీఓ 322 రద్దు చేయాలని జీఓ ప్రతులను దగ్ధం చేసిన ఉద్యోగులు
సహకార సంఘాల ఉద్యోగులకు నష్టం కలిగించే జీఓ 322 రద్దు చేయాలని సహకార ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కణేకల్లు, రాయదుర్గంలో ఉద్యోగులు జీఓ ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఉద్యోగుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పిఎసిఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు రమణారెడ్డి, కెసి ఆంజనేయులు, దాదాపీర, రైతు సంఘం, సిఐటియు నాయకులు జయచంద్రారెడ్డి, మల్లికార్జున పాల్గొన్నారు.