మార్కాపురం: మార్కాపురం నూతన జిల్లా అడ్మిన్ ఓఎస్డిగా నవజ్యోతి మిశ్ర నియామకం
మార్కాపురం జిల్లా అడ్మిన్ ఓ ఎస్ డి గా నవ జ్యోతి మిశ్రా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ నుంచి అధికారికంగా ఉత్తర్వులు ఎలువడ్డాయి. ఈయన గతంలో చింతపల్లి ఏఎస్పీగా పని చేశారు. త్వరలో జిల్లా మొదటి ఓ ఎస్ డి గా నవజ్యోతి మిశ్రా ఐపీఎస్ బాధ్యతలు స్వీకరించనున్నారు.