కొండపి: సింగరాయకొండ జాతీయ రహదారిపై నిలిచిపోయిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, తీవ్ర అవస్థలు పడ్డ యాత్రికులు
తీర్థయాత్రలు ముగించుకొని తిరుగుపయనమైన హైదరాబాద్ ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాత్రి సింగరాయకొండ జాతీయ రహదారిపై అకస్మాత్తుగా రిపేర్ రావడంతో నిలిచిపోయింది. రాత్రి సమయం కావడం, సమీపంలో వాహన మరమ్మతు కార్మికులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు రోడ్డుపైనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.