గిద్దలూరు: కంభం మండలం కందులాపురం సెంటర్లో లారీ ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలు ద్విచక్ర వాహనదారుడు మృతి
మార్కాపురం జిల్లా కంభం మండలం కందులాపురం సెంటర్లో మంగళవారం రాత్రి లారీ దిచక్రవాహనం ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో కంభం పట్టణానికి చెందిన దిలీప్ కుమార్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. గాయపడ్డ సమయంలో మొదట దిలీప్ కుమార్ ని కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. జరిగిన ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.