గిద్దలూరు: గిద్దలూరు టిడిపి కార్యాలయంలో ఈనెల 13వ తేదీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బారు కార్యక్రమం
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఈనెల 13వ తేదీ సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే కార్యాలయం నిర్వహణ సిబ్బంది ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను పరిష్కరిస్తారని ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. కాబట్టి ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించుకోవాలని కార్యాలయం నిర్వహణ సిబ్బంది తెలిపారు.