దర్శి: ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థినీలను అభినందించిన టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | Apr 16, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఆదర్శ మోడల్ పాఠశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థినిలు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. బుధవారం విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మంచి మార్కులు సాధించిన విద్యార్థినిలను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఉన్నతమైన హోదాలలో స్థిరపడాలని వారికి సూచించారు.