కర్నూలు బస్సు ప్రమాదం తనను కలచివేసిందని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి తెలిపారు. తాము 1934 నుంచి బస్సులను నడుపుతున్నామని, దివాకర్ ట్రావెల్స్క పేరు రావడంతోనే తాము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పారు. గతంలో ఆలిండియా పర్మిట్ విధానం ఉండేదని, దాన్ని రద్దు చేయడంతో బస్సులపై అవగాహన లేనివారు ట్రావెల్స్ నడుపుతున్నారన్నారు. సింగిల్ విధానం అమలు చేస్తే ట్రావెల్స్ తగ్గుముఖం పడతాయని తెలిపారు.