గిద్దలూరు: కొమరోలు మండలంలో ఈనెల 27 బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఈనెల 27వ తేదీ బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. కొమరోలు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో తాతిరెడ్డి పల్లి గ్రామానికి ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గృహ మరియు వ్యవసాయ సంబంధిత విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని శ్రీనివాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.