మార్కాపురం: జిల్లా కేంద్రంలో భగీరథ మహర్షి వేడుకలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం వద్ద భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బ్రహ్మ దేవుని ప్రత్యక్షం కోసం వంటి కాలుపై తపస్సు చేసి గంగను భూమి పైకి తెప్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారని వివరించారు. సంకల్ప బలంతో ఏదైనా సాధించవచ్చు అనే విషయాన్ని విద్యార్థులు యువకులు తెలుసుకోవాలని సూచించారు.