గిద్దలూరు: గిద్దలూరు మండలంలో అకాల వర్షం వల్ల అరటి పంట నష్టం, వందల ఎకరాలలో పంట నష్టపోయిన రైతులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలంలో అకాల వర్షాలు అరటి రైతులను నిండా ముంచాయి. బురుజుపల్లి, ఉప్పలపాడు, ముండ్లపాడు, క్రిష్టం శెట్టిపల్లి గ్రామాలలో 100 ఎకరాలలో అరటిపంట వేసిన రైతులు నష్టపోయారు. ఎకరాకు లక్షల వరకు పెట్టుబడి పెట్టి పంట సాగు చేశామని తీరా పంట చేతికి వచ్చే సమయానికి వర్షం తమ ఆశలపై నీళ్లు చల్లిందని రైతులు వాపోయారు. గత నాలుగు సంవత్సరాలుగా తమకు ఇదే పరిస్థితి ఏర్పడిందని గతంలో కూడా ప్రభుత్వం తమని ఆదుకున్న దాఖలు లేవని తెలిపారు. ఈ సంవత్సరమైనా అరటి రైతులను ఆదుకొని నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.