రాయదుర్గం: పట్టణంలోని 15 వ వార్డు లో పాడుబడ్డ బావి పూడ్చివేత పనులు చేపట్టిన మున్సిపల్ అధికారులు
రాయదుర్గం పట్టణంలోని 15 వ వార్డు ముత్తరాసి కాలనీ సమీపంలో పాడుబడ్డ బావి నుంచి వస్తున్న దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ఆ బావికి మట్టి వేసి పూడ్చివేత పనులు చేపట్టారు. టిడిపి నాయకులు, మున్సిపల్ అధికారులు దగ్గర ఉండి సోమవారం ఉదయం నుంచి టిప్పర్ ల ద్వారా మట్టిని వేసి ఆ బావి పూడ్చివేత పనులు పర్యవేక్షించారు. దీంతో స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.