రాయదుర్గం: జనగణన చేపట్ఠే ఎన్యుమరేటర్, సూపర్వైజర్ లకు శిక్షణ తరగతులు ప్రారంభం
జనగణన చేపట్ఠే ఎన్యుమరేటర్ లు, సూపర్వైజర్ లకు మూడురోజుల శిక్షణ తరగతులు రాయదుర్గంలో ప్రారంభమయ్యాయి. గురువారం పట్టణంలోని పట్టణంలోని మోడల్ స్కూల్ లో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ సెన్సెస్ ఆఫీసర్ హరికుమార్, అడిషనల్ సెన్సెస్ ఆఫీసర్ డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్ రాయ్ ప్రారంభించారు. సెన్సెస్ - 2027 పక్కాగా చేపట్టాలని ఆదేశించారు. శిక్షకులు రోషయ్య, శ్రీనివాసులు, హనుమంతరాయ పాల్గొన్నారు.