గిద్దలూరు: బేస్తవారిపేట సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడ్డ బొలెరో వాహనం, డ్రైవర్ కి గాయాలు
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట సమీపంలోని అమరావతి, అనంతపురం జాతీయ రహదారిపై బుధవారం అదుపుతప్పి బొలెరో వాహనం బోల్తా పడింది. ఘటనలో డ్రైవర్ కు గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తుతో డ్రైవర్ వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. విజయవాడ నుంచి నంద్యాలకు బుక్స్ లోడ్ ను తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.