గిద్దలూరు: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యావ్యవస్థను బలోపేతం చేశారు: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖను బలోపేతం చేశారని మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన.. డీఎస్సీలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తే ప్రతిపక్షం అనవసరంగా బురదలుతుందని అన్నారు. స్పోర్ట్స్ కోటాని రెండు శాతం నుంచి మూడు శాతానికి పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు శుభ్రమైనవి మంచినీరు సదుపాయాలు మెరుగైన విద్యను అందించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు.