దర్శి: దొనకొండ మండలం ఎర్రపాలెం ఎస్సీ కాలనీలో ఇంటింటికి టిడిపి ప్రచార కార్యక్రమం
ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఎర్రపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇంటింటికి టిడిపి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి రెండు సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.