దర్శి: కురిచేడు మండల పరిషత్ పాఠశాల ప్రహరీ గోడకు శంకుస్థాపన చేసిన దర్శి ఇన్చార్జి డాక్టర్ లక్ష్మి
ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలోని మండల పరిషత్ పాఠశాల ప్రహరీ గోడ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధికి ఏదైనా అవసరమైతే నేరుగా తనను కలవాలని ఆమె చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్యప్రసాద్ టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.