మార్కాపురం: దరిమడుగు జాతీయ రహదారికి సమీపంలో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక
మార్కాపురం మండలం దరిమడుగు జాతీయ రహదారికి సమీపంలో విచ్చలవిడిగా మట్టితవ్వకాలు చేపట్టారు. ఆ ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు ఉన్న వాటి చుట్టూ మట్టి వదిలేసి ప్రమాదకరంగా మట్టిని తీశారు. పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. భారీ వర్షాలు పడినప్పుడు నీరు చేరి ప్రమాదకరంగా మారబోతుంది. మూగ జీవాలు, పిల్లలు ఈత కొట్టడానికి ఆ ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.