రాయదుర్గం: భైరవానితిప్ప ప్రాజెక్టు ఆయకట్టు కింద ఆశాజనకంగా వరి సాగు : ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
బిటి ప్రాజెక్టు ఆయకట్టు కింద ఈఏడాది ఆశాజనకంగా వరి సాగైందని రాయదుర్గం MLA కాలవశ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం గుమ్మగట్ట మండలంలోని కలుగోడు సమీపంలో ఆయకట్టు రైతు కరిబసప్ప పొలాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. ఎకరానికి 40 బస్తాలకు పైగా దిగుబడి వస్తుందని రైతు తెలిపారు. సకాలంలో నీరు ఇవ్వడంతో BTP కింద 3500 ఎకరాల్లో వరి సాగైందని తెలిపారు. AMC చైర్మన్ హనుమంతరెడ్డి, కాలవ సన్నన్న, దానవేంద్ర పాల్గొన్నారు.