మార్కాపురం: జిల్లా కేంద్రంలో పెట్రోల్ బంకులను తనిఖీ చేసిన కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా కేంద్రంలో పెట్రోల్ బంకులను జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా బాటిల్స్ క్యాన్లలో పెట్రోల్ ఇవ్వవద్దని యజమానులను హెచ్చరించారు. ప్రజలు సాధారణంగా ఎలా పెట్రోల్ పొందుతారు అదేవిధంగా అందించాలన్నారు. పట్టణంలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. నోస్టాకు బోర్డులు పెట్టరాదని ఇబ్బందులు కలిగిస్తే వెంటనే తన కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు.