కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలోని ప్రజా వేదికలో 24 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సురేంద్రబాబు
కళ్యాణదుర్గం లోని ప్రజా వేదికలో శుక్రవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మొత్తం 24 మంది బాధితులకు సుమారు 30 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనంత పెద్ద మొత్తంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మన రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతున్నదన్నారు.