దర్శి: దర్శి మండలం సమంతాపుడి గ్రామంలో పిడుగుపాటుతో యువకుడు మల్లికార్జున మృతి
ప్రకాశం జిల్లా దర్శి మండలం సమంతాపుడి గ్రామంలో ఓ కుటుంబాన్ని పిడుగుపాటు చిదిమేసింది. ఈదురు గాలులతో కూడిన వర్షంతో పాటు పిడుగు పడింది. పిడుగు పడిన ప్రాంతంలో ఆవుల మల్లికార్జున ఉండడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అతడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.