తాడిపత్రి: తలారి చెరువు సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
తాడిపత్రి మండలం తలారి చెరువు గ్రామ సమీపంలో ఓ చెట్టుకు షేక్ దాదాభాష (28) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాడిపత్రి పట్టణంలోని టైలర్స్ కాలనీకి చెందిన షేక్ దాదాభాష తాడిపత్రిలోని ఆర్జాస్ స్టీల్ ప్లాంట్ లో అప్రెంటిస్ చేస్తున్నాడు. గత నెల 31న ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. తిరిగి రాలేదు. ఈ క్రమంలో శుక్రవారం చెట్టు కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.