రాయదుర్గం: సర్ ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు సహకరించాలి : ఈఆర్ఓ
సర్ ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు రాజకీయ పార్టీల బిఎల్ఏలు సహకరించాలని రాయదుర్గం నియోజకవర్గం ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి రవి శంకర్ రెడ్డి కోరారు. మంగళవారం రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఐదు మండలాల ఏఈఆర్ఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 2002 ఓటరు జాబితాలో ఓటరుగా ఉండి 2025 ఓటరు జాబితాలో ఓటర్లుగా ఉన్న వారిని BLO App SIR మ్యాపింగ్ చేయడం జరుగుతోందన్నారు. బూత్ స్థాయి అధికారుల ద్వారా ఓటరు జాబీతాలను తప్పులు లేకుండా తయారు చేస్తామని తెలిపారు.