రాయదుర్గం: దర్గాహొన్నూర్ లో తాగునీటి సమస్య పరిష్కారం చర్యలు
బొమ్మనహాల్ మండలంలోని దర్గాహోన్నూర్ గ్రామంలో ఇటీవల తాగునీటి ఎద్దడి నెలకొని గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాజీ సర్పంచ్ కేశప్ప స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. దీంతో గ్రామంలో కొత్తగా నీటి బోరు వేయించి తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఆదివారం బోరువేయించడంతో నీరు పుష్కలంగా పడ్డాయని గ్రామస్తులు తెలిపారు. ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలియజేశారు.