గిద్దలూరు: గిద్దలూరు నియోజకవర్గంలో వైసిపి నాయకులు నిరసన, కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేయడంలో వైఫల్యం చెందిందని నిరసనలు
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అనే కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి మహిళలకు 1500 రూపాయలు నగదు అందించే పథకాలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. మళ్లీ వచ్చేది జగనన్ననని పేదలందరూ ఆనందంగా ఉండవచ్చని వైసిపి నాయకులు అన్నారు.