ఉరవకొండ: ఎర్రగుడి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద పంచాంగ శ్రవణం : వేద పండితులు రాంబాబు స్వామి
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని ఎర్రగుడి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉగాది పండుగ సందర్భంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం రైతులకు ఎలా ఉంటుందని శుక్రవారం పంచాంగ శ్రవణంతో వేద పండితులు రాంబాబు రైతులకు చదివి వినిపించారు. పరాభవ నామ సంవత్సరంలో రైతులకు వర్షాలు, పంట దిగుబడి అనుకూలంగా ఉంటాయని, గ్రామ అభివృద్ధి, పాడిపంటలు గురించి గ్రామస్తులకు పంచాంగం చదివి వినిపించాడు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.