గిద్దలూరు: అర్ధవీడు మండలం గన్నేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం గన్నేపల్లి గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామంలో నీటి సమస్య పరిష్కారానికి ఈ ట్యాంక్ నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసిందని మరో రెండు సంవత్సరాల నియోజకవర్గంలో ఇంటింటికి నీటి కొళాయి ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు.