గిద్దలూరు: కొమరోలు మండలంలో వైసీపీ కార్యకర్తల సమావేశం, పాల్గొన్నారు రాష్ట్ర బీసీ సెల్ వైసీపీ అధ్యక్షుడు వెంకటనాయుడు
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని వైసీపీ కార్యకర్తల సమావేశం మంగళవారం జరిగింది. కార్యక్రమం రాష్ట్ర వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు వెంకటనాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో జరిగింది. సీఎంగా జగనన్న సమయంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు వెంకటనాయుడు పిలుపునిచ్చారు. సోషల్ మీడియా విభాగం వేగవంతంగా పనిచేయాలని పార్టీ కార్యక్రమాలను చురుగ్గా ప్రజలలోకి తీసుకువెళ్లాలన్నారు.