రాయదుర్గం: కో ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ కమిటీ చైర్మన్గా పూజారి శివప్రసాద్ నియామకం
రాయదుర్గం పట్టణంలోని కో-ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ కమిటీ చైర్మన్గా టీడీపీ సీనియర్ నేత పూజారి శివప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం వ్యవసాయ, సహకార శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్తో పాటు శెట్టి కృష్ణమూర్తి, ఎ. సతీష్లను సభ్యులుగా నియమించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ, ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.