కనిగిరి: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలోని మదర్ కేర్ యూనిట్ ను ఎమ్మెల్యే పరిశీలించి అక్కడ వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యశాలలోని మదర్ కేర్ యూనిట్ లో తల్లి బిడ్డ సంరక్షణ కోసం వైద్యులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు.