కనిగిరి: మా బడి మాకు కావాలంటూ హనుమంతునిపాడులో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దళితులు నిరసన ర్యాలీ నిర్వహణ
హనుమంతునిపాడు: పాఠశాలల విలీన ప్రక్రియ పేరుతో ప్రభుత్వం దళితవాడలో ఉన్న పాఠశాలలను వేరే పాఠశాలలో విలీనం చేయడానికి నిరసిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దళితులు హనుమంతునిపాడులో సోమవారం నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ... పాఠశాలల విలీన ప్రక్రియ పేరుతో ప్రభుత్వం అనుమంతునిపాడు మండలంలోని 15 పాఠశాలలను విలీనం చేస్తే అందులో 12 దళితవాడల పాఠశాలలు ఉన్నాయన్నారు. 2, 3 కిలోమీటర్ల దూరంలో ఉండే వేరే పాఠశాలలో విలీనం చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. దళితుల పాఠశాలలను దళితవాడలోనే ఉంచాలన్నారు.