కళ్యాణదుర్గం: జలధార కార్యక్రమానికి హాజరైన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల కు స్వాగతం పలికిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు
యాడికి లో జరిగిన జల ధార కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామ్మోహన్ నాయుడుకు అనంతపురంలో సోమవారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు నిమ్మల కు బొకే అందజేసి స్వాగతం పలికారు. జీడిపల్లి కాలువకు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రికి విన్నవించారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.