రాయదుర్గం: సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో భక్తిశ్రద్దలతో బాలాంజనేయస్వామి నూతన విగ్రహ ప్రతిష్ట, కళశ స్థాపన మహోత్సవం
రాయదుర్గం పట్టణంలోని సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో బాలాంజనేయస్వామి నూతన విగ్రహ ప్రతిష్టాపన కళశ స్థాపన మహోత్సవం మంగళవారం భక్తిశ్రద్దలతో నిర్వహించారు. ఆలయ కమిటీ పెద్దలు రాధాకృష్ణ, రామాంజనేయులు, శ్రీనివాసులు, రామరాజు, కమిటీ సభ్యులు ఆలయ భజన మండలి సభ్యులు, లక్ష్మీనారాయణ హమాలి యూనియన్ సభ్యులు భక్తుల ఆనందోత్సాహాల మధ్య కార్యక్రమం జరిగింది. వేద పండితులు మంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు నిర్వహించారు. గణపతి పూజ పుణ్యాహవచనం, వాస్తు శాంతి, అర్చనలు, మహామంగళహారతి లాంటి పలు విశేష పూజలు నిర్వహించారు.