గిద్దలూరు: కొమరోలు మండలం పామురుపల్లి గ్రామంలో 60 ఎకరాలకు పైగా అరటిపంట నష్టం, ఆదుకోవాలని వేడుకుంటున్నా రైతులు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో మంతా తుఫాను కారణంగా అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పామూరు పల్లి గ్రామంలోని 60 ఎకరాలకు పైగా అరటిపంట మంతా తుఫాను కారణంగా ధ్వంసం అయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు లక్షకు పైగా పెట్టుబడి పెట్టామని గతంలో కూడా ఇలానే పంట నష్టపోతే ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అందించిన ఆనవాళ్లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అరటి రైతులను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.