ఉరవకొండ: రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా మారుస్తాం: ముద్దలాపురంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
వెనకబడిన రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా హార్టికల్చర్ హబ్ గా మారుస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. కూడేరు మండలం ముద్దలాపురంలో ఆయన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తో కలిసి ఆదివారం వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో మీడియాతో మాట్లాడారు. నా చిన్నప్పుడు నల్లరేగడి నేలల్లో ధనియాలు సాగు చేసే వాళ్ళమన్నారు. తరువాత వేరుశెనగవైపు దృష్టి సారించామన్నారు. వేరుశనగ లాభదాయకం కాకపోవడంతో ఇతర పంటల వైపు దృష్టి సారించారన్నారు. హార్టికల్చర్ హబ్ గా మారిస్తే రైతులందరూ బాగుపడతారన్నారు.