కొండపి: కొండపి మండలంలో ఎయిర్టెల్ మొబైల్ నెట్వర్క్ నాణ్యతలేని సేవలతో ప్రజలు అవస్థలు, సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి
ప్రకాశం జిల్లా కొండపి మండలంలో ఎయిర్టెల్ మొబైల్ నెట్వర్క్ నాణ్యతలేని సేవలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొద్దిగా రోజులుగా వినిపించని ఫోన్ కాల్స్.. వేగం లేని ఇంటర్నెట్ తో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెబుతున్నారు. 28 రోజులు సమయం గడిచిన వెంటనే ముక్కు పిండి రీఛార్జిలు వసూలు చేస్తున్న కంపెనీలు.. నాణ్యత పాటించడంలో విఫలమవుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.