గిద్దలూరు: మద్యం తాగి వాహనం నడిపితే రూ.10వేలు జరిమానా, జైలు శిక్ష తప్పదని హెచ్చరించిన రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు
మద్యం తాగి వాహనం నడిపితే పదివేల రూపాయలు జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు వాహనదారులను హెచ్చరించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఎస్సై కోటేశ్వరరావు ప్రమాదాలు జరగకుండా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో మిర్రర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. సమాధానం నివారణకు వాహనదారులు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు.