మార్కాపురం: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రకటనలు బోర్డుతో పొంచి ఉన్న ప్రమాదం
మార్కాపురం జిల్లా కేంద్రంలోని గుండ్లకమ్మ నది బ్రిడ్జి సమీపంలో ప్రకటనల బోర్డు ఏర్పాటు చేశారు. ఇటీవల గాలి వానకు ఆ బోర్డు ద్వంశమైంది. ఇదే పరిస్థితి మరొకసారి నెలకొంటే ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారులకు పెను ప్రమాదం పొంచి ఉంది. ఇనుముతో తయారుచేసిన బోర్డుతో పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనదారులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఆ బోర్డును తొలగించాలని కోరారు.