మార్కాపురం: రజక వీధిలో అక్రమానికి గురైన మున్సిపాలిటీ స్థలాన్ని కాపాడాలని స్థానికులు కలెక్టర్ కు వినతి
మార్కాపురం రజక వీధిలో వెలిసి ఉన్న కోదండ రామస్వామి దేవస్థానం పురాతనమైనది. ఆలయానికి సమీపంలో మున్సిపల్ స్థలం ఉండడంతో బ్రహ్మోత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు బాల వెంకటరమణ తెలిపారు. ఆ స్థలాన్ని ఇతరులు ఆక్రమించుకొని ఇంటి నిర్మాణం చేపట్టారన్నారు. దీంతో ఆ స్థలాన్ని మున్సిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చామన్నారు.