తాడిపత్రి: రౌడీ షీటర్లు నిబంధనలో అతిక్రమిస్తే ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించిన తాడిపత్రి ఏ ఎస్ పి రోహిత్ కుమార్ చౌదరి
రౌడీ షీటర్లు నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించే పరిస్థితి లేదని తాడిపత్రి ఏ ఎస్ పి రోహిత్ కుమార్ చౌదరి స్పష్టం చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినా కాళ్లు విరగ్గొడతామని హెచ్చరించారు. 'తాడిపత్రి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఈ ఏడాది 11 మంది రౌడీలను రిమాండ్కు పంపాం. 492 మందికి కౌన్సెలింగ్ ఇచ్చాం. అందరూ చట్టపరిధిలో నడుచుకోండి. అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు' అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.