గిద్దలూరు: కొమరోలు మండలం దద్దవాడ గ్రామంలో రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ గ్రామంలో బుధవారం రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు. శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా గ్రామంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు పోటీల నిర్వహకులు తెలిపారు. పోటీలను ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే అశోక రెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. పోటీలలో విజయం సాధించే ఎడ్ల జతల యజమానులకు నగదు బహుమతులను అందజేస్తున్నట్లు పోటీల నిర్వాహకులు తెలిపారు.