మార్కాపురం: బక్రీద్ పండుగ శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలని పిలుపునిచ్చిన సీఐ ఆల్తాఫ్ హుస్సేన్
మార్కాపురం జిల్లా కేంద్రంలోని సిఐ కార్యాలయంలో బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం పెద్దలతో ఫీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ ఆల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ గోవధ జరగకుండా ప్రభుత్వం న్యాయస్థానాల మార్గదర్శికాలను కచ్చితంగా పాటించాలని అన్నారు. పండగ శాంతియుత వాతావరణం లో నిర్వహించుకోవాలని తెలిపారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అందరూ సహకరించాలని కోరారు.