గిద్దలూరు: రాచర్ల మండలం ఆరవీటి కోట అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు గుప్తనిద్ర తవ్వకాలు జరిపినట్లు పుకార్లు
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం ఆరవీటి కోట అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలు జరిపినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంత మంది వ్యక్తులు సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేస్తూ గుప్త నిధులు తవ్వగా రెండు భారీ కుండలు బయటపడ్డాయని అందులో వజ్రాలు బంగారం దొరికినట్లుగా సోషల్ మీడియాలో పుకార్ల షికారులు చేశాయి. అటవీ శాఖ అధికారులు వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. అయితే ఉన్నత అధికారుల ఆదేశాలతో పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు.